Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి

Vizianagaram Road Accident

Vizianagaram Road Accident

Vizianagaram Road Accident: విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పూసపాటి రేగ మండలం పేరాపురం సమీపంలో జాతీయ రహదారిపై నిలిపి ఉంచిన లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వైపు వెళ్తుండగా కారు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రోడ్డుపై ఉన్న ఇద్దరు వ్యక్తులు, కారులో ఉన్న మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారిని వెంటనే విజయనగరం ఆసుపత్రికి తరలించారు. మృతిచెందిన వారిలో ఒకరు బొబ్బిలి మండలం పిరిడి గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. గాయపడిన వారి నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నామని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. సీసీ కెమెరా దృశ్యాల కారు అతి వేగంతో వచ్చి లారీని ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.

Read Also: Peddi : పెద్ది ఐటం సాంగ్.. చరణ్ – శృతి హాసన్ డాన్స్ వీడియో లీక్