కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మను దర్శించుకున్నారు. అయితే కిషన్ రెడ్డికి స్వాగతం పలికారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు. దుర్గమ్మ ను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన కిషన్ రెడ్డి… దర్శనాంతరం అమ్మవారి ఆశీర్వచనాలతో పాటు తీర్ద ప్రసాదాలు అందించారు. కిషన్ రెడ్డి తో పాటు దుర్గమ్మను దర్శించుకున్నారు సోమూవీర్రాజు, మాధవ్.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ… కేంద్ర మంత్రి గా బాధ్యతలు స్వీకరించాక తెలుగు ప్రజల ఆశీర్వాదం కోసం వచ్చాను. నిన్న తిరు వెంకన్న స్వామిని, ఇవాళ దుర్గమ్మను దర్సించుకున్నా. దేశ సంస్క్రుతి, సాంప్రదాయాలను పరిరక్షించాలని మోడీ అకాంక్షించారు. వరంగల్ లో ని వీరబద్ర దేవాలయాన్ని యునెస్కొ హెరిటేజ్ సెంటర్ గా గుర్తించింది. రానున్న రోజుల్లో ఏపీ లో 126 కేంద్రాలున్నాయి. వాటిని రాష్ట్ర ప్రభుత్వం తో చర్చించి అభివృద్ధి చేస్తాం. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్ధలను పిలిచి సిఎస్అర్ ఫండ్ కింద డెవలప్ చేస్తాం. టూరిజం డిపార్ట్మెంట్ చాలా ఛాలెంజ్ తో జూడుకుంది. అయితే గత రెండేళ్లుగా కోవిడ్ తో టూరిజం దెబ్బతింది. జనవరి 1 నాటికి కోవిడ్ తగ్గగానే టూరిజాన్ని మరింత డెవలప్ చేస్తాం. భారత్ దర్శన్ ద్వారా చారిత్రాత్మక కట్టడాల విశిష్టతను అందరికీ తెలిపే విధంగా కార్యక్రమాలు చేపడతాం. పర్యటక శాఖ ద్వారా నా వంతు సహకారం తెలుగు రాష్ట్రాలకు తెలుగు వాడిగా అందిస్తా. ఏపీ తెలంగాణ మోడీ కి రెండు కళ్లలాంటివి. సీఎం జగన్ మర్యాద పూర్వకంగానే ఆహ్వానించారు .. తెలుగు వాడికి కేంద్రమంత్రి అవకాశం రావడంతోనే తేనేటి విందుకు ఆహ్వానించారు. దుర్మమ్మ ఆలయాన్ని టూరిస్ట్ స్పాట్ గా తీర్చిదిద్దేందుకు నా సహకారం అందిస్తా అని పేర్కొన్నారు.
