Site icon NTV Telugu

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాసవి కన్యాకా పరమేశ్వరి చౌల్ట్రీలు, అన్నదాన సత్రాలను దేవాదాయ చట్టం పరిధి నుంచి మినహాయిస్తున్నట్టు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆర్యవైశ్య అన్నదాన సత్రాలు, చౌల్ట్రీలను ఏపీ ధార్మిక హిందూ సంస్థలు, దేవాదాయ చట్టం నుంచి మినహా యిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఇక నుంచి ఆర్యవైశ్య సంఘాల పరిధిలోనే ఇవి పనిచేస్తాయని స్పష్టం చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. పాలనాపరమైన అంశాల్లో అవకతవకలు ఉన్నట్లయితే తక్షణమే ప్రభుత్వం ఈ మినహయింపును రద్దు చేస్తుందని షరతు విధించింది.

Exit mobile version