పశ్చిమగోదావరి జిల్లాలో ఆర్టీసీ బస్సు ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.. జంగారెడ్డిగూడెం సమీపంలో డివైడర్ను ఢీ కొన్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి జల్లేరు వాగులో పడిపోయింది.. అశ్వారావుపేట నుండి జంగారెడ్డి గూడెం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకోగా.. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ చిన్నారావు, తొమ్మిది మంది ప్రయాణికులు సహా మొత్తం 10 మంది మృతిచెందారు.. మరికొందరి పరిస్ధితి విషమంగా ఉంది.. అయితే, ఆ ప్రమాదానికి సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి..
Read Also: ఒమిక్రాన్ టెన్షన్.. హాట్ స్పాట్గా టోలిచౌకి పారామౌంట్ కాలనీ..!
ప్రమాదంలో గాయపడిన సోమశేఖర్ (డ్రైవర్ పక్క సీటులో కూర్చున్న వ్యక్తి) నిజాలను బయటపెట్టాడు.. బస్సు స్టీరింగ్ పట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని.. డ్రైవర్ ఎంత ట్రై చేసినా స్టీరింగ్ తిరగలేదని తెలిపాడు.. స్టీరింగ్ పట్టడంతో ఒక వైపు బస్సు వెళ్లిపోయిందన్న ప్రత్యక్షసాక్షి.. బస్సు మెయింటినెన్స్ సరిగా లేదు.. గతంలో కూడా ఈ బస్సుకి స్టీరింగ్ పట్టినట్టు చెబుతున్నారని.. ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, జల్లేరు వద్ద బ్రిడ్జిపై రేలింగ్ లేకపోవడం కూడా ఈ ప్రమాదానికి కారణంగా తెలిపాడు సోమశేఖర్.