Site icon NTV Telugu

ఏపీలో భారీ వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు…

trains

trains

ఏపీలో ముఖ్యంగా కడపలో భారీ భార్షలు కురుస్తున్న విషయం తెలిసిందే. దాంతో అక్కడ ప్రజలు ఎవరు ఇంటి నుంచి బయటికి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అయితే రేపు ఆ జిల్లా మీదుగా నడుస్తున్న పలు రైళ్లను రద్దు చేయగా…పలు రైళ్లు దారి మళ్లించారు. చెన్నై, తిరుపతి నుండి కడప మీదుగా నడిచే రైళ్లు రేపు రద్దు చేసారు. రేణిగుంట -గుంతకల్లు, గుంతకల్లు -రేణిగుంట మధ్య నడిచే ప్యాసింజర్ రైలు.. కడప -విశాఖపట్నం, విశాఖపట్నం -కడప మధ్య నడిచే తిరుమల ఎక్స్ ప్రెస్ రైలు… ఔరంగబాద్- రేణిగుంట, చెన్నై- లోకమాన్య తిలక్, చెన్నై- అహ్మదాబాద్, మదురై- లోకమాన్య తిలక్ మధ్య నడిచే రైళ్లను రద్దు చేసారు అధికారులు. అలాగే వెంకటాద్రి, రాయలసీమ ఎక్స్ ప్రెస్, ముంబై ఎక్స్ ప్రెస్, గోవా, హజ్రత్ నిజముద్దిన్ రైళ్ల దారిని మళ్లించారు.

Exit mobile version