NTV Telugu Site icon

LIVE: శనివారం ఈ స్తోత్ర పారాయణం చేస్తే…

శనివారం వేంకటేశ్వరుడికి ఎంతో ప్రీతీపాత్రమయింది. శనివారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మొదటి, రెండు, మూడు పర్యాయాలు పఠించడం ద్వారా విశేష ఫలితాలు లభిస్తాయని వేదాల్లో తెలిపారు. మన జీవితంతో ధర్మాన్ని తెలుసుకునేందుకు అవకాశం, శక్తి సరిపోదని, దీనిని సులభంగా తెలుసుకునేందుకు విష్ణు సహస్రనామాన్ని భీష్మాచార్యులు ధర్మరాజుకు వివరించగా మహావిష్ణువు ఆమోదించారు. అందువల్ల ఎవరైతే విష్ణుసహస్ర నామ స్తోత్రాన్ని పారాయణం చేస్తారో వాళ్లు భగవంతుడి సన్నిధికి చేరుతారని, ఇదే ముక్తికి మార్గం అని పండితులు చెబుతున్నారు.