అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త…నేడే వారి ఖాతాలో నగదు జమ

అగ్రిగోల్డ్‌ బాధితులకు ఇవాళ నగదు జమ చేయనుంది ఏపీ ప్రభుత్వం. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా బాధితుల ఖాతాల్లో నగదు చేయనున్నారు. అగ్రిగోల్డ్‌లో 10వేల లోపు డిపాజిట్‌ చేసి మోసపోయిన వారు 3లక్షల 86వేల మందికి ఉన్నారు. వీరి కోసం 207కోట్ల 61లక్షల రూపాయలను జమ చేయనున్నారు ముఖ్యమంత్రి. అలాగే 10వేల నుంచి 20వేల లోపు డిపాజిట్‌ చేసి మోసపోయిన వారు మూడు లక్షల మందికిపైగా ఉన్నారు. వీరి కోసం 459కోట్ల 23లక్షలు చెల్లించబోతున్నారు.