Site icon NTV Telugu

అక్కడే చలనాల కుంభకోణం జరిగిందని గుర్తించాం : రిజిస్ట్రేషన్స్ ఐజీ

17 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చలనాల కుంభకోణం జరిగిందని గుర్తించాం అని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీ శేషగిరిబాబు అన్నారు. రూ. 5 కోట్ల మేర నిధులు పక్క దారి పట్టినట్టు గుర్తించాం. రూ. కోటి రికవరీ చేశాం అని తెలిపారు. బోగస్ చలనాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆస్తుల విషయంలో ఏం చేయాలనే అంశంపై న్యాయ సలహాలు తీసుకుంటున్నాం. ఆస్తులని రిజిస్ట్రేషన్ చేసినట్టు ప్రస్తుతం రికార్డుల్లో ఉంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కొత్త సాఫ్ట్ వేర్ అందుబాటులోకి వచ్చింది. కొత్త సాఫ్ట్ వేర్ ను సీఎఫ్ఎంఎస్ తో అనుసంధానం చేశాం. ఎవరెవరి పాత్ర ఏ మేరకు ఉందనేది పోలీసుల విచారణలో తేలుతుంది అని పేర్కొన్నారు.

Exit mobile version