జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్కు స్వచ్ఛ అవార్డుల పంట పండింది… స్వచ్ఛ అమృత్ మహోత్సవ్లో భాగంగా కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వివిధ కేటగిరీల్లో ఏకంగా 11 అవార్డులు దక్కాయి… ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు స్వచ్ఛ అవార్డులు పొందిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు చెందిన మేయర్లు, కమిషనర్లు… పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నేతృత్వంలో సీఎం జగన్ ను కలిశారు.. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలను ఏపీ సీఎం అభినందించారు.. ఇంకా మెరుగ్గా పనిచేస్తూ మరిన్ని అవార్డులు సాధించాలని సూచించారు సీఎం వైఎస్ జగన్. కాగా, కేంద్రం ప్రకటించిన ఈ అవార్డులను ఈ నెల 21వ తేదీన ఢిల్లీలో అందజేసిన సంగతి తెలిసిందే.
ఏపీకి స్వచ్ఛ అవార్డుల పంట.. సీఎం జగన్ అభినందనలు..
