Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fuel Shortage: రాష్ట్రంలో ఇంధన సరఫరా పరిస్థితులపై ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష నిర్వహించారు. ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పెట్రోల్, డీజిల్ సరఫరా, నిల్వలు, ఫిర్యాదులపై సమగ్రంగా చర్చించారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల కమిషనర్ కన్నబాబు కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో కొంతమంది పెట్రోల్ బంకులు నిల్వలు ఉన్నప్పటికీ లేవని చెబుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని మంత్రి తెలిపారు. అలాంటి బంకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బల్క్గా డీజిల్, పెట్రోల్ను పక్కదోవ పట్టిస్తే సహించబోమని స్పష్టం చేశారు.
Read Also: AshuReddy Audio Leaks : అషు రెడ్డి ఆడియో కాల్స్ లీక్.. నా మాట వినకుంటే అంతే సంగతులని వార్నింగ్
Also Read
- Amaravati Land Pooling: అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్.. 1,654 ఎకరాల భూమి సమీకరణకు నోటిఫికేషన్..
- Amaravati: రాజధాని గ్రామాలకు గుడ్ న్యూస్.. 29 గ్రామాలకు భారీగా నిధులు..
- RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
- YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
టోల్ ఫ్రీ నెంబర్ 1967 కు పెట్రోల్ బంకులపై అధిక సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయని వెల్లడించారు. జిల్లా వారీగా వచ్చిన నివేదికలను పరిశీలించి వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా డ్రై అవుట్ పరిస్థితులు తగ్గుముఖం పట్టాయని, ఆయిల్ కంపెనీల నుంచి డిస్పాచ్లు వేగవంతం అయ్యాయని మంత్రి తెలిపారు. ప్రస్తుతం అమలు చేస్తున్న రేషన్ విధానం మంచి ఫలితాలు ఇస్తోందని, పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు అదే విధానం కొనసాగుతుందని చెప్పారు.
రైతులకు ఎలాంటి ఇంధన కొరత రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు నాదెండ్ల.. ముఖ్యంగా ఆక్వా రైతులు, రబీ పంట కోతల కోసం అవసరమైన డీజిల్ సరఫరాకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. వ్యవసాయ, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. కృత్రిమ కొరత సృష్టించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మంత్రి నాదెండ్ల స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేస్తున్న వారిపై కూడా నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఇంధన పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి చేరే వరకు నిరంతర సమీక్ష కొనసాగిస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు లేకుండా సరఫరా వ్యవస్థను పటిష్టంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Joe Root: రిక్కీ పాంటింగ్ రికార్డు చెల్లాచెదురు.. జో రూట్ అరుదైన ఘనత..
-
Dasara: క్రేజీ హీరోస్ అందరూ మూకుమ్మడిగా దసరా పండగకే ?
-
Nikitha Godishala: యూఎస్ లో మాజీ ప్రియురాలి హత్య కేసు.. ఆగ్రాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
-
Geetu Mohandas : అసలు ఏం చెప్పాలనుకుంది? ఏం చెప్పింది?
-
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
ట్రెండింగ్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!