NTV Telugu Site icon

యాదగిరిగుట్టలో స్వచ్చంద లాక్ డౌన్…

నేటి నుండి 10 రోజుల పాటు మధ్యాహ్నం రెండు గంటల నుండి యాదగిరిగుట్ట మునిసిపాలిటీ పరిధిలో స్వచ్చంద లాక్ డౌన్ పాటిస్తున్నారు.క‌రోనా కేసులు రోజురోజుకి పెరుగుతుండ‌టంతో ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్ర‌మైన ల‌క్ష్మీనార‌సింహ స్వామి కొలువైఉన్న‌ యాదగిరిగుట్టలో లాక్‌డౌన్ విధించారు. ఇవాళ మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి ఇది ప్రారంభ‌మ‌వుతుంది. నేటి నుంచి ప‌ది రోజుల‌పాటు అమ‌ల్లో ఉండ‌నుంది.  ప్రతిరోజు మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి మ‌రుస‌టి రోజు ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు ఆంక్ష‌లు విధిస్తున్నారు. దీంతో ప్ర‌తి రోజు ఉద‌యం 5 గంటల నుంచి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు వ్యాపారులు త‌మ వ్యాపార క‌లాపాలు కొన‌సాగించుకోవ‌చ్చ‌ని యాద‌గిరిగుట్ట మున్సిప‌ల్ చైర్‌ప‌ర్స‌న్ ఎరుక‌ల సుధ వెల్ల‌డించారు. లాక్‌డౌన్ నుంచి పాలు, పండ్లు, కూర‌గాయ‌లు, కిరాణం, మెడిక‌ల్ షాపులు మిన‌హాయింపు ఉంటుంద‌ని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు.