Site icon NTV Telugu

ఫిలిప్పిన్స్‌లో రాయ్ భీభ‌త్సం… 20 మంది మృతి…

ఫిలిప్పిన్స్‌లో రాయ్ తుఫాన్ భీభ‌త్సం సృష్టించింది.  ఈ తుఫాన్ ధాటికి ఫిలిప్పిన్స్‌లోని అన్ని రాష్ట్రాలు వ‌ణికిపోయాయి.  ఈ వ‌ర్షాల‌కు సుమారు 23 మంది మ‌ర‌ణించార‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.  తుఫాన్ పై ముందుగానే హెచ్చ‌రించి తీర‌ప్రాంతాల‌వారిని త‌రలించ‌డంతో ప్రాణ‌న‌ష్టం త‌ప్పింద‌ని అధికారులు చెబుతున్నారు.  అయితే, తుఫాన్ కార‌ణంగా భారీ ఆస్తీనష్టం సంభ‌వించింది.  

Read: ఆ వీడియో మ‌ళ్లీ వైర‌ల్‌…

దేశంలోని సింహ‌భాగం రాష్ట్రాల్లో క‌రెంట్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది.  రాయ్ తుఫాన్ తీరం దాటిన స‌మ‌యంలో గంటకు 195 నుంచి 270 కిమీ వేగంతో పెనుగాలులు వీచాయి.  ఈ పెనుగాలుల ధాటికి పెద్ద పెద్ద వృక్షాలు నేల‌కొరిగాయి.  భారీ వ‌ర్షాలు కుర‌వ‌డంతో ఇల్లు కొట్టుకుపోయాయి.  క‌రెంట్ స్తంభాలు నేల‌కొర‌గ‌టంతో దేశంలోని చాలా రాష్ట్రాల్లో క‌రెంట్ క‌ట్ అయింది.  దీంతో రాష్ట్రాల్లో క‌రెంట్ లేక అంథ‌కార‌మ‌య్యాయి.  

Exit mobile version