NTV Telugu Site icon

ప్రమాదంలో సుంకేసుల ప్రాజెక్టు.. పని చేయని 16 గేట్లు

కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిపై నిర్మించిన సుంకేసుల ప్రాజెక్ట్‌ ప్రమాదంలో పడింది. ఎగువున భారీ వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా ప్రాజెక్ట్‌కి నష్టం వాటిల్లేలా వుంది. తుంగభద్ర డ్యాం నుంచి నీరు విడుదల చేస్తే సుంకేసుల భద్రత ప్రశ్నార్థకం కానుంది. ఈ ప్రాజెక్టుని కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి ప్రాజెక్టు అంటారు. ఇటు తెలంగాణ, అటు ఏపీలోనూ వందలాది గ్రామాలకు తాగునీరు, సాగునీరు అందిస్తోంది. సుంకేసుల ప్రాజెక్ట్‌కి సంబంధించి 16 గేట్లు పనిచేయడం లేదు. సుంకేసుల ప్రాజెక్టు నిర్వహణ అత్యంత దయనీయంగా వుంది. ఈ ప్రాజెక్టుకి తెలంగాణ, ఏపీ రెండువైపులా వుంటాయి. 30 రేడియల్ క్రస్ట్ గేట్లు వుండగా అందులో 16 గేట్లు పనిచేయడం లేదు. ప్రభుత్వం పట్టించుకోకుంటే అన్నమయ్య ప్రాజెక్టు తరహా నష్టం సంభవించే ప్రమాదం వుంది.

ప్రమాదంలో సుంకేసుల ప్రాజెక్టు, పని చేయని 16 గేట్లు | Ground Report on Sunkesula Project Situation