NTV Telugu Site icon

Delhi excise policy case: కవితకు మరోసారి ఈడీ నోటీసులు

mlc kavitha

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో కవిత విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే, ఈ రోజు హాజరుకావడం లేదని ఆమె ఈడీకి సమాచారం అందించారు. మరో రోజు హాజరు అవుతానని తన ప్రతినిధితో ఈడీకి లేఖను పంపింది. ఈ లేఖను పరిశీలించిన ఈడీ అధికారులు ఆమె విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారు. ఈ క్రమంలో కవితకు మరోసారి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈనెల 20న విచారణకు హాజరు కావాలని అధికారులు ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా ఈనెల 11న కవితను విచారించిన ఈడీ అధికారులు 16న మళ్లీ విచారణకు హాజరవ్వాలని నోటీసులు ఇచ్చారు. ఈడీకి కవిత లేఖ రాసిన నేపథ్యంలో మరో తేదీన విచారణకు రావాలని ఈడీ తాజాగా నోటీసులు ఇచ్చింది.