NTV Telugu Site icon

Karmasthalam: ఆసక్తికరంగా పాన్ ఇండియా ‘కర్మ స్థలం’ మోషన్ పోస్టర్

Karmasthalam

Karmasthalam

రాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ సుబ్రహ్మణ్య నిర్మాణంలో రాకీ షెర్మన్ తెరకెక్కించిన చిత్రం ‘కర్మ స్థలం’. ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ అర్చన(వేద), మితాలి చౌహాన్, వినోద్ అల్వా, కాలకేయ ప్రభాకర్, బలగం సంజయ్, నాగ మహేష్, దిల్ రమేష్, చిత్రం శ్రీను ముఖ్య పాత్రలు పోషించారు. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో శుక్రవారం నాడు ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ను హీరో ఆకాష్ పూరి రిలీజ్ చేశారు. ముఖ్య అతిధులుగా ఆకాష్ పూరితో పాటు మరో హీరో విజయ్ శంకర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు క్రాంతి కిల్లి మాట్లాడుతూ..”ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు చాలా థాంక్స్. 2022 లో కాశ్మీర్ స్టోరీస్ వచ్చింది, 2023 లో కేరళ స్టోరీస్ వచ్చింది, అలాగే చావా, రజాకార్ ఇలా కొన్ని సినిమాలు మన సనాతన ధర్మం గురించి మన హిందూ ధర్మం గొప్పతనాన్ని చెప్పాయి.

నేను చిన్నపాటి నుంచి చదువుకున్న దాంట్లో తెలియని ఎన్నో కథలను సినిమాలు చూసి తెలుసుకున్నాను. మన హిందూ ధర్మం గొప్పతనాన్ని అందరికి తెలియడానికి ఇలాంటి సినిమాలు వస్తున్నాయి కాబట్టి అందరూ సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. ఇలాంటి సినిమాలో నేను కూడా పార్ట్ అవడం చాలా హ్యాపీగా వుంది. ఇది ఇంతటితో ఆగదు కర్మస్థలం తరువాత కుంభస్థలం వస్తుందని అన్నారు. డైరెక్టర్ రాకీ మాట్లాడుతూ మనం సాధారణంగా ఎలాంటి పండగ వచ్చిన ఎంజాయ్ చేస్తూ ఉంటాం. దాని వెనకాల ఒక హిస్టరీ, వార్ ఇలా చాలా ఉన్నాయి. ఇందులో ఒక మంచి లైన్ చెప్పాను అదే మహిషాసుర మర్దిని. అందరికీ మోషన్ పోస్టర్ నచ్చింది అనుకుంటున్నాను.నేను ఎంత ప్యూర్ గా నమ్మానో అంత మంచిగా ఈ సినిమా చేశాను. అందరు సపోర్ట్ ఇస్తారు అని అనుకుంటున్నాను.” అన్నారు.