టాలీవుడ్ స్క్రీన్ కి ఓ కొత్త అమ్మాయి హీరోయిన్ గా పరిచయం కానుంది. భైరవి టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ‘సర్కార్ నౌకరి’ ఫేమ్, సింగర్ సునీత తనయుడు ఆకాష్ హీరోగా తధాస్తు క్రియేషన్స్ బ్యానర్పై చేస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 మూవీలో హీరోయిన్గా భైరవి టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తోంది. ఇది ఆమెకు మొదటి సినిమా అయినప్పటికీ మంచి మార్కులే కొట్టేసినట్టు తెలుస్తోంది. శివ వర ప్రసాద్ దర్శకత్వంలో, తాటి బాలకృష్ణ నిర్మాణంలో సీనియర్ నటీనటులు రఘుబాబు, పృద్వి, ప్రభావతి తదితరులు ఈ సినిమాలో నటించారు.
ఈ సందర్భంగా నిర్మాత తాటి బాలకృష్ణ మాట్లాడుతూ… ”ఈ మూవీ విలేజ్ బ్యాక్ గ్రౌండ్లో రూపొందిస్తున్నాం. రొమాంటిక్ లవ్ సస్పెన్స్ కామెడీ చిత్రం. సర్కార్ నౌకరి ఫేమ్ ఆకాష్ హీరోగా నటించే ఈ సినిమా కోసం హీరోయిన్ గా భైరవి తెలుగు తెరకు తొలి పరిచయం చేస్తున్నాం, అచ్చమైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో భైరవి సరిగ్గా సరిపోతుందని అన్నారు. హీరోకి మరదలు పాత్ర చేస్తుంది, ఆమె పాత్ర సినిమాలో హైలైట్ గా ఉండబోతోందని అన్నారు.