వైఎస్సార్ టీపీ అధినేత షర్మిల ఇవాళ మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. హవేలీ ఘనపూర్ మండలంలోని భూపతిపూర్ గ్రామానికి షర్మిల వెళ్లనున్నారు. రైతు కరణం రవి కుటుంబాన్ని షర్మిల పరామర్శించనున్నారు. వరి సాగు వేయవద్దన్న ప్రభుత్వ ప్రకటనతో సీఎంకు లేఖ రాసి రైతు కరణం రవి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇది ఇలా ఉండగా.. అంతకు ముందు.. కేసీఆర్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ షర్మిల. ”రైతులను కోటీశ్వర్లు చేశానని గప్పాలు కొట్టే దొర గారు, ఆ రైతుల ఆదాయం నెలకు 1697 రూపాయలు మాత్రమే. ఇక ఆ ఆదాయం కూడా రైతుకు మిగలవద్దని వరి వేయొద్దంటున్నారు. ఒకసారి వడ్లు కొంటానంటావ్, మరోసారి వడ్లు కొనేది లేదంటావ్. నీ ఊసరవెల్లి రాజకీయాలతో రైతులు ఆగమైతున్నారు. కేసీఆర్ గారు వానాకాలం”అంటూ ట్వీట్ చేశారు షర్మిల.