జూబ్లిహిల్స్ టీటీడీ ఆలయంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి దేవేరులు సూర్యప్రభ వాహనంపై విహరిస్తున్నారు. భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయం దగ్గర సందడి నెలకొంది. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జూబ్లిహిల్స్ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఉదయం భక్తులకు అల్పాహారం, మధ్యాహ్నం అన్నప్రసాదం అందిస్తున్నారు.