Site icon NTV Telugu

రేవంత్‌రెడ్డికి ఊరట.. మూడు కేసులు కొట్టివేత

revanth reddy

revanth reddy

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి భారీ ఊరట లభించింది.. రేవంత్‌రెడ్డిపై నమోదైన మూడు కేసులను కొట్టివేసింది కోర్టు.. మహబూబాబాద్, చిక్కడపల్లి, ఉస్మానియా యూనివర్సిటీలో పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులపై ఇవాళ విచారణ జరిపిన ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం.. ఆ మూడు కేసులను కొట్టివేసింది.. రేవంత్‌రెడ్డి అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహించారన్న అభియోగాలను తోసిపుచ్చింది.. అభియోగాలకు తగిన ఆధారాలు లేకపోవడంతో రేవంత్ రెడ్డిపై ఈ మూడు కేసులు వీగిపోయాయి.. కాగా, ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల విచారణ కోసం ప్రత్యేక న్యాయస్థానం పనిచేస్తున్న సంగతి తెలిసిందే.. వివిధ సందర్భాల్లో ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను విచారిస్తున్న ఈ ప్రత్యేక న్యాయస్థానం.. వేగంగా ఆ కేసులను పరిష్కరించేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది.

Exit mobile version