ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొంతమంది మత్స్యకారులు చేపల వేట కోసం గుజరాత్ తీయడానికి వెళ్లి అక్కడ అనుకోకుండా పాకిస్తాన్ జలాల్లోకి ఎంటర్ అయ్యారు. వెంటనే వారిని పాకిస్తాన్ నేవీ అదుపులోకి తీసుకుని జైల్లో పెట్టింది. సుమారు 16 నెలల జైలు జీవితం గడిపిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ తీసుకోవడంతో పాకిస్తాన్ జైలు నుంచి శ్రీకాకుళం మత్స్యకారుల బృందం విడుదలైంది. వారిలో కొన్ని కథలను ఆధారంగా చేసుకుని ఒక సినిమా కథగా రూపొందించారు అదే ప్రాంతానికి చెందిన కార్తిక్ అనే యువకుడు. కార్తీక్ అందించిన కథకు చందు మొండేటి తనదైన స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. నాగచైతన్య కెరియర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించారు. ఇక నిజజీవిత తండేల్ రామారావు నూకమ్మ దంపతుల ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ తీసుకుంది వనితా టీవీ.. మీరు కూడా ఒక లుక్ వేసేయండి మరి.
Real Thandel: రియల్ తండేల్ తో ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ.. షాకింగ్ విషయాలు విన్నారా?
![Thandel](https://d2zfbyesi0qka0.cloudfront.net/wp-content/uploads/2025/02/thandel-9-1024x576.jpg)
Thandel