NTV Telugu Site icon

Vishwambhara : వాయిదాకు నో అన్న మెగాస్టార్.. సంక్రాంతి బరిలోనే విశ్వంభర

Viswambhara

Viswambhara

Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటెడ్ మూవీ ‘విశ్వంభర’. బింబిసారతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో అత్యంత భారీ బడ్జెట్ లో యువీ క్రియేషన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి జోడీగా స్టార్ హీరోయిన్‌ త్రిష, ఆషిక రంగనాథ్ నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులను ప్రారంభించాడు దర్శకుడు వశిష్ఠ. ఆస్కార్ గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నామని గతంలో ఎప్పుడో ప్రకటించారు మేకర్స్. అందుకు అనుగుణంగా షూటింగ్ పనులు చక చక చేస్తున్నారు. విశ్వంభర చిత్రాన్ని దాదాపు రూ.200 కోట్ల భారీ బ్జడెట్‌తో నిర్మిస్తున్నారు.

Read Also:Eluru Tragedy: ఏలూరులో విషాదం.. భర్త, ఇద్దరు కూమారుల మృతి.. మనస్థాపంతో భార్య ఆత్మహత్య..

ఎన్నో అంచనాలు నెలకొన్న చేసుకున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం షూటింగ్ అలాగే డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ఇలా అన్నీ ఏకకాలంలో జరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమాపై ఇపుడు లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం సినిమాలో రెండు పాటలు షూటింగ్ మినహా అంతా పూర్తి అయ్యిపోయినట్టుగా తెలుస్తుంది. ఇవి కూడా అతి త్వరలోనే పూర్తి చేసి ఈ జనవరి బరిలోనే సినిమాని దింపే సన్నాహాలు మేకర్స్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా చిత్రీకరణతో పాటు నిర్మాణాంతర పనులు, సినిమాకు అత్యంత కీలకంగా భావిస్తున్న వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ కూడా పెండింగ్‌లో ఉందట. అందుకే హడావుడిగా ఈ పనులు పూర్తిచేసి సినిమాను విడుదల చేయడం ఇష్టం లేని డైరెక్టర్ వశిష్ఠ చిత్రాన్ని సంక్రాంతి నుంచి వాయిదా వేయాలనే ప్రపోజల్‌ను హీరో చిరంజీవి, నిర్మాత వద్ద ఉంచాడట. అయితే చిరంజీవి మాత్రం రాత్రి పగలు కష్టపడి సినిమాకు సంబంధించిన పనులన్నీ పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేయమని కోరాడట. సినిమాలకు అత్యంత కీలకంగా భావించే సంక్రాంతి సీజన్‌ను మిస్‌ కాకుండా చూసుకోవాలని సూచించారని తెలుస్తోంది.

Read Also:Mahadev Betting App: మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ స్కాంలో కీలక పరిణామం.. నిందితులకు రెడ్‌కార్నర్‌ నోటీసులు