NTV Telugu Site icon

NEET: నీట్ రగడ.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముట్టడి

Kishan Reddy Bjp

Kishan Reddy Bjp

యూజీసీ నెట్ పేపర్ లీక్ సహా నీట్‌లో అవకతవకలపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతోంది. ఈ పరీక్షలను నిర్వహించే ఎన్టీఏ (NTA) రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో.. హైదరాబాద్ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంటిని యువజన విద్యార్థి సంఘాల నాయకులు ముట్టడించారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ, అవకతవకల పై ఎన్టీఏని రద్దు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వ తిరుకు నిరసనగా నేతలు ముట్టడించారు. నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలంటూ.. మళ్లీ తిరిగి ఎగ్జామ్ పెట్టాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నీట్ సమస్య పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ కోరగా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి సంఘాల నాయకులు ముట్టడించారు. అందులో భాగంగా.. వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. మరోవైపు.. పార్లమెంట్‌ సమావేశాలు ఐదోరోజు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే.. రెండు సభల్లో నీట్‌పై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో గందరగోళం నెలకొంది.