Kollywood : ఆ దర్శకుడు చేసినవీ రెండే సినిమాలు కానీ యూత్‌లో ఫుల్ క్రేజ్

Ashwath Maritmuthu

Ashwath Maritmuthu

ఆ దర్శకుడు చేసినవీ రెండే సినిమాలు కానీ యూత్‌లో క్రేజ్ తెచ్చుకున్నాడు. అతడి ధర్డ్ ఫిల్మ్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. హీరో కూడా ఫిక్స్ అయ్యాడు. ఓ స్టార్ బ్యూటీని కోలీవుడ్‌కు పరిచయం చేయబోతున్నాడట. కొత్త కొత్త కాన్సెప్ట్‌లతో న్యూ జనరేషన్ దర్శకులు యూత్‌ని త్వరగా ఎట్రాక్ట్ చేస్తున్నారు. వారిలో ఒకరు అశ్వత్ మారిముత్తు. ఇప్పటి వరకు చేసినవీ రెండు సినిమాలే.. కానీ పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. షార్ట్ ఫిల్మ్స్ తీసుకునే దగ్గర నుండి ఇప్పుడు స్టార్ హీరోలకు దర్శకత్వం వహించే స్థాయికి ఎదిగాడు. ఓ మై కడవలేతో మెగాఫోన్ పట్టిన అశ్వత్.. ఇదే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే.. దానికి కెప్టెన్ ఆఫ్ ది షిప్ బాధ్యతలు తీసుకున్నాడు.

Also Read : Pawan Kalyan : ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ ప్రమోషన్స్‌కు పవన్‌కల్యాణ్‌ వస్తాడా రాడా?

గత ఏడాది ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన డ్రాగన్‌తో అశ్వత్ క్రేజ్ విపరీతంగా పెరిగింది. కేవలం కోలీవుడ్‌లో మాత్రమే కాదు.. టాలీవుడ్‌లోనూ అశ్వత్ పేరు మారుమోగిపోయింది. ఈ రెండింటిలోనూ సెకండ్ ఛాన్స్ వస్తే అనే కాన్సెప్టే డిఫరెంట్ యాస్పెక్ట్స్ అండ్ సిచ్యుయేషన్స్‌లో చూపించి సక్సెస్ అయ్యాడు. నెక్ట్స్ ఫిల్మ్ కోసం శింబుని ఫిక్స్ చేశాడు. మృణాల్ ఠాకూర్ ఈ మూవీతో కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుందట. సంతానం కీ రోల్ చేయబోతున్నాడని లెటెస్ట్ బజ్. మరీ సేమ్ కాన్సెప్ట్‌నే శింబు 51కి అశ్వత్ అప్లై చేస్తాడా. మరేదైనా డిఫరెంట్ కథ అందిస్తాడా అనేది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.