TS EdCET : తెలంగాణ ఎడ్సెట్ 2023 నోటిఫికేషన్విడుదలైంది. అప్లికేషన్లతో పాటు, ఎగ్జామ్ తేదీల షెడ్యూల్ను తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈసారి మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఈ పరీక్షనిర్వహిస్తుంది. తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, టీఎస్ ఎడ్సెట్ కన్వీనర్, మహాత్మాగాంధీ వర్సిటీ వీసీ సీహెచ్ గోపాల్ రెడ్డి కలిసి షెడ్యూల్ను విడుదల చేశారు. మే 18న ఎడ్సెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. మార్చి 6వ తేదీ నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తారు. యూనివర్సిటీలు, కాలేజీల్లో రెండేళ్ల బీఈడీ కోర్సులో చేరేందుకు ఈ ఎంట్రన్స్ నిర్వహిస్తారు. డిగ్రీ పాసైన అభ్యర్థులు, డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు బీఈడీ ఎంట్రన్స్ రాసేందుకు అర్హులు. భవిష్యత్తులో టీచర్ జాబ్ సాధించాలనుకునే వారందరూ బీఈడీ, లేదా డీఈడీ పూర్తి చేయాల్సి ఉంటుంది.
Read Also: Maheshwar Reddy : మా మధ్య ఏం లేదు.. బాంబు పేల్చిన మహేశ్వరరెడ్డి
అభ్యర్థులు ఈ నెల 6నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ తో పాటు రూ.750 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.500 ఫీజు చెల్లించాలి. ఏప్రిల్ 20వ తేదీ వరకు అప్లికేషన్లకు తుది గడువుగా నిర్ణయించారు. లేట్ ఫీతో ఏప్రిల్ 25వ తేదీ వరకు అప్లై చేసుకునే వెసులుబాటు ఉంటుంది. మే 5వ తేదీ నుంచి ఆన్లైన్లో హాల్టికెట్లు అందుబాటులో ఉంటాయి. మే 18న ప్రవేశ పరీక్ష నిర్వహించి, 21న ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు.