Hyderabad: జ్వరం అని వెళ్తే ప్రాణాలు తీశారు! వైద్యం వికటించి 6 నెలల శిశువు మృతి

Six Month Old Baby Dies

Six Month Old Baby Dies

Hyderabad: వైద్యం వికటించి 6 నెలల శిశువు మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లోని సన్ సిటీ పరిధిలో చోటుచేసుకుంది. రాము అనే ఆరు నెలల శిశువు చికిత్సలో భాగంగా మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. శిశువుకు జ్వరం రావడంతో తల్లిదండ్రులు సమీపంలోని క్రియాన్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఎక్సైపిరి (గడువు ముగిసిన) మందు ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మందు ఇచ్చిన కొద్దిసేపటికే బాలుడి ఆరోగ్యం విషమించడంతో పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారులను విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానికులు కూడా ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆస్పత్రి నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

READ MORE: T20 World Cup 2026: ఒక్క మ్యాచ్ గెలవకపోయినా.. జాక్‌పాట్ కొట్టిన జట్లు ఇవే!