NTV Telugu Site icon

బాలీవుడ్ నటులపై ఐటీ దాడులు..

 ముంబై పోలీసులు బాలీవుడ్ ఫిలిం మేకర్స్‌పై ఐటీ దాడులు నిర్వహించారు. ప్రముఖ సినీ నిర్మాతలు, దర్శకులు అనురాగ్ కశ్యప్, వికాస్ భల్, మధు మంతెనలతో పాటుగా నటి తాప్సీ తదితరుల ఆస్తుల పై ఇన్‌కమ్ టాక్స్ తనిఖీలు జరుగుతున్నాయి. అయితే 2018లో నిలిచిపోయిన్ కశ్యప్ ఫాంటమ్ ఫిలింస్‌తో వారికి సంబంధం ఉందా లేదా అన్న విషయం పై ముంబై పోలీసులు ఈ తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీలు రిలియన్స్ ఎంటర్‌టైన్మెంట్ సీఈఓ, ఎక్సీడ్ సీఈఓ, క్వాన్ సీఈఓ తదితరుల ఆస్తుల పై కూడా జరిగింది. అయితే ఫిలిం మేకర్స్ అనురాగ్ కశ్యప్, విక్రమాధిత్య, మధు మంతెన కలిసి 2015లో ఫాంటమ్ ఫిలింస్‌ను ప్రారంభించారు. ఈ ప్రొడక్షన్ బ్యానర్‌పై చాలా సినిమాలు తెరకెక్కాయి. వాటిలో కొన్ని హిట్స్ అందుకున్నాయి. మరి ప్లాప్‌ అయ్యాయి. ఆ తరువాత రిలియన్స్ ఎంటర్‌టైన్మెంట్ వారు ఇందులో యాభైశాతం స్టేక్ తీసుకున్నారు. ఆ తర్వాత ఈ ప్రొడక్షన్ కంపెనీ పై మాజీ ఉద్యోగి పెట్టి లైంగిక వేధింపుల కేసును నమోదు చేశారు. అందులో ప్రధానంగా వికాస్ భల్ పేరును నమోదు చేశారు. ఆ తరువాత అదే కేసు కారణంగా మూతబడింది. ఇప్పుడు ఆ కేసుతో సంబంధం ఉన్న వారి ఆస్తులపై ముంబై పోలీసులు తనిఖీలు చేపట్టారు.