Maha Kumbh Mela 2025: మరోమారు మహా కుంభమేళాలో చెలరేగిన మంటలు

  • ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్‌లో మరోసారి అగ్నిప్రమాదం
  • శంకరాచార్య మార్గ్‌ లోని సెక్టార్-18లో అగ్నిప్రమాదం.
Fire

Fire

Maha Kumbh Mela 2025: నేడు (శుక్రవారం) ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్‌లో మరోసారి అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే, అనేక అగ్నిమాపక యంత్రాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. వార్త అందే సమయానికి మంటలను ఆర్పడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. శంకరాచార్య మార్గ్‌ లోని సెక్టార్-18లో ఈ అగ్నిప్రమాదం జరిగింది. దీని కారణంగా అక్కడ ఉన్న అనేక టెంట్లు బూడిదయ్యాయి. టెంట్ కు మంటలు అంటుకున్న వెంటనే చుట్టుపక్కన ఉన్న ప్రజలను ఖాళీ చేయించారు. అయితే అక్కడ గాలి బలంగా వీస్తున్నందున, మంటలు వేగంగా వ్యాపించాయి.

Also Read: Nandini Rai : నేరేడు పళ్ళు.. నందిని రాయ్ కళ్ళు..

×
×
Ad

దాంతో, సమీపంలోని ఇతర గుడారాలలో నివసించే ప్రజలు బయటకు రావాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతానికి అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం కలగలేదని తెలుస్తోంది. అయితే, అగ్నిప్రమాదానికి కారణమేమిటో ఇంకా తెలియరాలేదు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.