Helicopter For Bride: వధువును ఇంటికి తీసుకెళ్లేందుకు హెలికాప్టర్‌ను ఏర్పాటు చేసిన వరుడు

  • వధువును ఇంటికి తీసుకెళ్లేందుకు హెలికాప్టర్‌
  • ఉత్తరప్రదేశ్ లోని రబుపురా పోలీస్ స్టేషన్ పరిధిలోని రుస్తాంపూర్ గ్రామంలో
  • ఏసీపీ ఆధ్వర్యంలో తొమ్మిది మంది సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, 18 మంది కానిస్టేబుళ్లు బందోబస్తు.
Helicopter For Bride

Helicopter For Bride

Helicopter For Bride: మనం పెళ్లిళ్లలో చాలారకాల వీడ్కోలు చూసి ఉంటాము. కానీ, ఆడంబరమైన పెళ్లి తర్వాత ఎప్పటికీ గుర్తుండిపోయే వీడ్కోలు ఒకటి తాజాగా జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని రబుపురా పోలీస్ స్టేషన్ పరిధిలోని రుస్తాంపూర్ గ్రామంలో ఒక రైతు తండ్రి హెలికాప్టర్‌లో తన కుమార్తె వధువుకు వీడ్కోలు పలికాడు. ఇందులో విశేషమేమిటంటే.. వధువు తల్లి ఇంటి నుంచి అత్తమామల ఇంటికి దూరం కేవలం 14 కిలోమీటర్లు మాత్రమే. ఇందుకోసం వరుడి తండ్రి సుమారు ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. వీరితో పాటు గౌతమ్‌ బుద్ధనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ఏసీపీ ఆధ్వర్యంలో తొమ్మిది మంది సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, 18 మంది కానిస్టేబుళ్లు బందోబస్తు బాధ్యతలు చేపట్టారు.

Also Read: Jharkhand Election Results: జార్ఖండ్‌లో బీజేపీ ఘోర పరాజయానికి కారణాలు ఇవే..

వధువును తీసుకెళ్లేందుకు వరుడు హెలికాప్టర్‌లో రావడంతో రుస్తాంపూర్ గ్రామంలో జనం గుమిగూడారు. సుభాష్ సింగ్ కుమార్తె అంజలి రాజ్‌పుత్ వివాహం గురువారం రుస్తంపూర్ గ్రామంలో జరిగింది. ఇకపోతే వరుడి పేరు అమన్. అతను మహమద్పూర్ గ్రామానికి చెందినవాడు. కానీ, ప్రస్తుతం ఫార్మసిస్ట్ అయిన బులంద్‌షహర్‌లోని కాకోడ్‌లో తన కుటుంబంతో నివసిస్తున్నాడు. అంజలి వివాహం రుస్తంపూర్ గ్రామంలో గురువారం జరిగినప్పటికీ ఆమె వీడ్కోలు శుక్రవారం మధ్యాహ్నం హెలికాప్టర్ ద్వారా జరిగింది. దీనిని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. దీంతో వరుడి తండ్రి భద్రతా ఏర్పాట్లకు సంబంధించి పోలీసులు అప్పటికే ఏర్పాట్లు చేశారు.

Also Read: Yashasvi Jaiswal: వామ్మో.. జైస్వాల్ మామూలోడు కాదుగా.. ఆస్ట్రేలియా ఆటగాళ్లనే కవ్వించాడుగా (వీడియో)

అంజలి రాజ్‌పుత్ వీడ్కోలు చూడటానికి రుస్తాంపూర్ గ్రామంలో వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. ఆ రద్దీని దృష్టిలో ఉంచుకుని భారీ బందోబస్తు ఏర్పాట్ల కోసం ఒక ఏసీపీ ఆధ్వర్యంలో తొమ్మిది మంది సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, 18 మంది కానిస్టేబుళ్లను నియమించారు. దీని కోసం వరుడి తండ్రి పోలీస్ కమీషనర్ గౌతమ్ బుద్ నగర్ నుండి పరిమిషన్ కోరాడు. ఆ తర్వాత గ్రేటర్ నోయిడా డిసిపి అనుమతి ఇచ్చారు. పోలీసులు శుక్రవారం ఉదయం 7:00 గంటలకు సంఘటనా స్థలానికి చేరుకుని భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే, మధ్యాహ్నం 3:00 గంటలకు హెలికాప్టర్‌లో వధువు ప్రయాణించింది.