Site icon NTV Telugu

అండమాన్‌ దీవుల్లో భూకంపం..రిక్టర్‌ స్కేల్‌పై 3.8 నమోదు

అండమాన్‌ దీవుల్లో గురువారం అర్థరాత్రి దాటిన అనంతరం భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్‌ స్కేల్‌ పై 3.8 తీవ్రతతో రాత్రి 1.37 గంటల సమయంలో భూమి కంపించిందని నేషనల్‌ సెంటర్ ఫర్‌ సిస్మోలజీ పేర్కొంది. నికోబార్‌ దీవిలోని క్యాంప్‌ బెలే బే నుంచి 640 కి మీ దూరంలో.. భూమికి పది కిమీ లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు ఎస్‌సీఎస్‌ పేర్కొంది. గురువారం ఉదయం నాలుగు రాష్ట్రాల్లో భూమి కంపించింది. జమ్మూ కాశ్మీర్‌ లోని కత్రా, యూపీలోని మీరట్, ఉత్తరాఖండ్‌ లోని గర్హ్వాల్‌, గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ప్రకంపనలు వచ్చాయి. ప్రకంపనలు స్వల్పంగా రావడంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

Exit mobile version