NTV Telugu Site icon

Delhi Water Crisis: పైప్ లైన్లను ధ్వంసం చేస్తున్నారని మంత్రి అతిషి ఆరోపణలు..(వీడియో)

Maxresdefault (22)

Maxresdefault (22)

ఢిల్లీ వాసులు తీవ్ర నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. అనేక ప్రాంతాల్లో నీటి కొరత ఉంది. ఈ పరిస్థితిలో, ఢిల్లీ జలవనరుల శాఖ మంత్రి అతిషి సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో నీటి సమస్యను మరింత పెంచేందుకు పైప్‌లైన్‌లను ధ్వంసం చేసే కుట్ర జరుగుతోందని ఆమె అన్నారు. ఈ నేపథ్యంలో, ఇవాళ దక్షిణ ఢిల్లీలో 25% నీటి కొరత ఏర్పడిందని తెలిపారు. ఈ విషయంపై ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు లేఖ రాసి, ప్రధాన నీటి పైపులైన్లకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.