Site icon NTV Telugu

CM Revanth Reddy: డిఫెన్స్ మినిస్టర్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. ఏం చర్చించారంటే?

Cm Revanth

Cm Revanth

CM Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. నేడు ఉదయం దేశ ర‌క్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఫిబ్రవ‌రి చివ‌రి వారంలో నిర్వహించే గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టు శంకుస్థాప‌న కార్యక్రమానికి హాజ‌రు కావాల‌ని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. ఈసా.. మూసీ న‌దుల సంగ‌మ స్థలంలో కార్యక్రమం చేప‌డుతున్నట్లు ర‌క్షణ మంత్రికి సీఎం వివ‌రించారు. 1948 ఫిబ్రవ‌రిలో మ‌హాత్ముని చిత‌భ‌స్మాన్ని ఈసా.. మూసీ సంగ‌మ స్థలిలో నిమ‌జ్జనం చేశార‌ని కేంద్ర మంత్రికి తెలిపారు. మూసీ పున‌రుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టు చేప‌డుతున్నట్లు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు స్పష్టం చేశారు. బాపూఘాట్‌ను ప్రపంచ స్థాయి విద్యా, సాంస్కృతిక‌, ఆధ్యాత్మిక‌, ప‌ర్యావ‌ర‌ణ చిహ్నంగా నిల‌ప‌నున్నట్లు కేంద్ర మంత్రికి వివరించారు.

READ MORE: Filmfare Awards : 70వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ 2026.. టాలీవుడ్ నామినేషన్ల పూర్తి జాబితా!

అంతకు ముందు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయాలు, పరిపాలన అంశాలపై పార్టీ పెద్దలతో చర్చించారు. దావోస్ పర్యటన, హార్వర్డ్ శిక్షణ, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన విషయాలను వివరించారు. రేవంత్ రెడ్డి కొందరు కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను వారి దష్టికి తీసుకెళ్తారని అధికార వర్గాలు తెలిపాయి. పార్లమెంటుకు వెళ్లి ఎంపీలను కలిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.

Exit mobile version