BRSLP : కేసీఆర్ అధ్యక్షతన కొనసాగుతున్న బీఆర్‌ఎస్ఎల్పీ సమావేశం

  • ఎర్రవల్లిలో కేసీఆర్ అధ్యక్షతన కొనసాగుతున్న BRSLP సమావేశం
  • రెండు గంటలుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాట్లాడుతున్న కేసీఆర్‌, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం
Brslp

Brslp

BRSLP : బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అధ్యక్షతన పార్టీ శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశం ఎర్రవెల్లి వద్ద ఉన్న కేసీఆర్‌ నివాసంలో జరుగుతున్నది, ఇందులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు హాజరయ్యారు. సోమవారం నుండి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్‌ ప్రజాప్రతినిధులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. కేసీఆర్‌ వ్యాఖ్యానించిన ప్రకారం, కాంగ్రెస్‌ ప్రభుత్వమెలో ఏడాదిగా తీసుకుంటున్న ప్రజావ్యతిరేక విధానాలు, వర్గా ల ప్రజలు అనుభవిస్తున్న ఇబ్బందులను అసెంబ్లీ వేదికపై ప్రశ్నించేందుకు కావలసిన వ్యూహాలను ఆయన పంచుకున్నట్లు తెలుస్తోంది. అలాగే, హైడ్రా, లగచర్ల ఘటనల ద్వారా తెలంగాణ ప్రతిష్ట దెబ్బతిన్నదని, కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల పై ప్రజల ఎదురుచూపులు, నిరసనలు వంటి అంశాలను అసెంబ్లీ వద్ద చర్చించేందుకు ఏవైనా చర్యలు తీసుకోవాలని కేసీఆర్‌ సూచించే అవకాశాలున్నాయి.

NZ vs Eng: రెండో టెస్టులో విజయం.. సిరీస్ కైవసం చేసుకున్న ఇంగ్లాండ్