UPSC ESE 2026: ఇంజనీరింగ్ పూర్తయ్యిందా?.. ఈ పోస్టులకు ఇప్పుడే అప్లై చేసుకోండి..

  • UPSC 474 ఖాళీ పోస్టులను భర్తీ చేస్తుంది
  • అక్టోబర్ 16 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
Job

Job

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026 (ESE) కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. UPSC ఈ నియామక డ్రైవ్ ద్వారా మొత్తం 474 ఖాళీ పోస్టులను భర్తీ చేస్తుంది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన లేదా చివరి సంవత్సరం/సెమిస్టర్‌లో ఉన్న అభ్యర్థులు ఈ నియామక పరీక్షకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు సంబంధిత ట్రేడ్/స్ట్రీమ్‌లో ఇంజనీరింగ్ డిగ్రీని పొంది ఉండాలి. ఇంజనీరింగ్ చివరి సంవత్సరం/సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులు కూడా ఈ నియామక పరీక్షకు హాజరు కావడానికి అర్హులు.

Also Read:Bhatti Vikramarka: భవిష్యత్ అంతా ఫ్యూచర్ సిటీలోనే.. అభివృద్ధికి కేర్ అఫ్ అడ్రస్

దీనితో పాటు, జనవరి 1, 2026 నాటికి, అభ్యర్థికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి. 30 సంవత్సరాల వయస్సు మించకూడదు. అంటే, అభ్యర్థి జనవరి 2, 1996 కి ముందు, జనవరి 1, 2005 తర్వాత జన్మించి ఉండకూడదు. జనరల్, OBC, EWS వర్గాల అభ్యర్థులు రూ. 200 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. SC, ST, PH వర్గాల అభ్యర్థులు నియామకానికి ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుమును డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 16 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.