Site icon NTV Telugu

మరో కీలక పదవికి ప్రశాంత్ కిషోర్ రాజీనామా…

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరో కీలక పదవికి రాజీనామా చేశారు.  పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీకి ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించిన ప్ర‌శాంత్ కిషోర్ ఆ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కూడా ఆ పార్టీ వ్య‌వ‌హారాల్లో చురుగ్గా మారారు. అయితే, ముఖ్య‌మంత్రి అమ‌రీంద‌ర్ సింగ్ ప్ర‌శాంత్ కిషోర్‌ను ఈ ఏడాది మార్చి నెల‌లో సీఎం ప్ర‌ధాన స‌ల‌హాదారుడిగా నియ‌మించింది.  ఆయ‌న‌కు కేబినెట్ హోదాను క‌ల్పించింది.  కాగా, ఆయ‌న ఇప్పుడు త‌న బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకున్నారు.  ప్ర‌జా జీవితంలో క్రియాశీల పాత్ర నుంచి కొన్ని రోజులు విరామం తీసుకోవాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాన‌ని, అందుకే తాను ప‌ద‌వి నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టు సీఎం అమ‌రీంద‌ర్ సింగ్‌కు లేఖ రాశారు.

Read: బాలీవుడ్ పై ప్రభుత్వం దృష్టి! కాశ్మీర్ వైపు బాలీవుడ్ చూపులు…

ప్ర‌ధాన స‌ల‌హాదారుడిగా రాజీనామా చేసిన త‌రువాత ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో చేరే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.  అయితే, దీనిపై అటు ప్ర‌శాంత్ కిషోర్‌గాని, కాంగ్రెస్ అధిష్టానం గాని ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌లేదు.  2014లో బీజేపీ త‌ర‌పున ఎన్నిక‌ల వ్యూహాల‌ను ర‌చించిన పీకే ఆ త‌రువాత బీజేపీకి వ్య‌తిరేకంగా వివిధ రాష్ట్రాల ఎన్నిక‌ల్లో వ్యూహ‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించారు.  గ‌తంలో బీహార్ ఎన్నిక‌ల్లో నితీష్ కుమార్ పార్టీ జేడీయు త‌ర‌పున వ్యూహ‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించిన త‌రువాత ఆయ‌న‌కు పార్టీ ఉపాధ్య‌క్ష ప‌ద‌విని అప్ప‌గించారు. ఆ త‌రువాత జేడీయు బీజేపీతో చేతులు క‌ల‌ప‌డంతో ప్ర‌శాంత్ కిషోర్ ఆ పార్టీ నుంచి ప‌క్క‌కు త‌ప్పుకున్నారు.  ఇప్పుడు ఇప్పుడు అమ‌రీంద‌ర్ సింగ్ ప్ర‌ధాన స‌ల‌హాదారుడి ప‌దవి నుంచి కూడా త‌ప్పుకోవ‌డంతో నెక్ట్స్ ఏం చేయ‌బోతున్నార‌ని దానిపై అంద‌రిలోనూ ఆస‌క్తి నెల‌కొన్న‌ది.  

Exit mobile version