Site icon NTV Telugu

వ్యాక్సినేషన్ పై కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన…

కరోనా వ్యాక్సినేషన్ పై కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. మొదటి విడత “వ్యాక్సిన్” తీసుకున్న తర్వాత “కరోనా” సోకినట్లయితే, “కరోనా” సోకిన నాటి నుంచి క్లినికల్ రికవరీ తర్వాత, 3 నెలల వరకు మలి విడత “వ్యాక్సిన్”వాయిదా వేయాలని తెలిపింది. తీవ్ర అనారోగ్యంతో అసుపత్రులలో చికిత్స పొందిన “కరోనా” యేతర పేషెంట్లు కూడా, రికవరీ తర్వాత, 4 నుండి 8 వారాల పాటు టీకా తీసుకోవడం కోసం వేచి ఉండాలి. “కోవిడ్-19” సోకిన వ్యక్తి “వ్యాక్సిన్” తీసుకున్నా, లేదా RT-PCR నెగెటివ్ గా వచ్చిన 14 రోజుల తర్వాత రక్తదానం చేయవచ్చు. పాలిచ్చే మహిళలకూ టీకాలు సిఫార్సు చేసారు. టీకా ఇవ్వడానికి ముందు “రాపిడ్ యాంటిజెన్ టెస్ట్”ద్వారా టీకా గ్రహీతలను పరీక్షించాల్సిన అవసరం లేదు అని పేర్కొంది.

Exit mobile version