Site icon NTV Telugu

SEBI: కేంద్రం కీలక నిర్ణయం.. సెబీకి నూతన సారథి నియామకం

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్ ఆఫ్‌ ఇండియా(SEBI)కి కేంద్ర ప్రభుత్వం కొత్త ఛైర్‌పర్సన్‌ను నియమించింది. ప్రస్తుత ఛైర్మన్‌ అజయ్‌ త్యాగి ఐదేళ్ల పదవీ కాలం సోమవారం ముగుస్తున్నందున ఆ బాధ్యతలను సెబీ మాజీ సభ్యురాలు మాధవి పూరీ బుచ్‌కు అప్పగించింది. క్యాపిటల్‌ మార్కెటింగ్‌ రెగ్యులేటరీ సంస్థ అయిన సెబీకి ఛైర్‌పర్సన్‌గా ఓ మహిళను నియమించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

కాగా మూడేళ్ల పాటు మాధవి పూరీ బుచ్‌ నియామకానికి కేబినెట్‌ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది. ఐసీఐసీఐ బ్యాంకులో తన కెరీర్‌ను ప్రారంభించిన మాధవి.. దాదాపు రెండు దశాబ్దాలపాటు ఆ గ్రూప్‌లో పనిచేశారు. అదే సమయంలో 2009 ఫిబ్రవరి నుంచి 2011 మే మధ్య కాలంలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌కు ఎండీగా, సీఈవోగా కీలక బాధ్యతలు నిర్వహించారు.

https://ntvtelugu.com/amul-milk-prices-will-increased-from-march-1st/
Exit mobile version