ఎన్ని సినిమాలు కరోనా సమయంలో వాయిదా పడ్డాయో అన్ని సినిమాలు విడుదల అయ్యి ప్రేక్షాదరణ పొందాయి. ఒక్క ‘విరాట పర్వం’ తప్ప.. రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అప్పుడెప్పుడో ఒక రిలీజ్ డేట్ ని ప్రకటించారు.. వెంటనే లాక్ డౌన్ స్టార్ట్ అయ్యింది. లాక్ డౌన్ తర్వాత మరో రిలీజ్ డేట్ ప్రకటించారు.. మరోసరి లాక్ డౌన్.. ఇక ఆ తరువాత ఈ సినిమా గురించిన ఒక అప్డేట్ ను మేకర్స్ ఇవ్వలేదు. దీంతో పలువురు పలు రకాలుగా అనుకోవడం మొదలుపెట్టారు. కొంతమంది ఓటిటీ లో వస్తుందని, ఇంకొంతమంది అసలు సినిమా రిలీజ్ కాదని కామెంట్స్ చేస్తూ వస్తున్నారు.
ఇక ఎట్టకేలకు ఈ పుకార్లకు చెక్ పెట్టేశారు మేకర్స్. ఈ సినిమా రిలీజ్ కి సంబంధించిన అప్డేట్ ను ఈరోజు సాయంత్రం 5 గంటలకు తెలపనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఉత్తర తెలంగాణలో 1990 నేపథ్యంలో జరిగిన యదార్థ సంఘనల స్ఫూర్తితో తెరకెక్కిన ఈ చిత్రంలో రానా.. నక్సలైట్ రవన్న గా కనిపించనుండగా, భారతక్క గా ప్రియమణి, రవన్న రచనలకు ఫిదా అయ్యి అతడికోసం అడవికి వెళ్లి ఇబ్బందులు పడిన యువతిగా సాయి పల్లవి నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక అప్డేట్ విన్న రానా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హమ్మయ్య ఇప్పటికైనా మా ఆతృతను గుర్తించి అప్డేట్ ఇస్తున్నందుకు థాంక్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమా ఏ సినిమాకు పోటీగా రానుందో చూడాలి.
The most awaited announcement is here 🤘
Unveiling #VirataParvam Grand Release Date Today at 5 PM 🔥@RanaDaggubati @Sai_Pallavi92 @venuudugulafilm #SureshBobbili @dancinemaniac @laharimusic @SureshProdns @SLVCinemasOffl pic.twitter.com/KX3nV39sH9
— v e n u u d u g u l a (@venuudugulafilm) May 6, 2022
