Dia Mirza : ప్రకృతి వనరులను అమ్మాయిలా వాడుకుని వదిలేయకండి.. నాగ్ హీరోయిన్ కామెంట్స్

Diamirza

Diamirza

అక్కినేని నాగార్జున నటించిన ‘వైల్డ్ డాగ్’ మూవీతో హీరోయిన్  గా ఎంట్రీ ఇచ్చిన మిస్ ఆసియా పసిఫిక్ టైటిల్ విన్నర్ ‘దియా మీర్జా’ అనుకోని వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల బాలీవుడ్ లో సోహా అలీ ఖాన్ నిర్వహిస్తున్న పాడ్ క్యాస్ట్ లో పాల్గొని ప్రకృతి నాశనం అవడానికి కారణం కేవలం మగవాళ్ళు అంటూ వివాదాస్పద కామెంట్స్ చేసారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట పెద్ద చర్చకు దారి తీశాయి. హీరోయిన్ గా కెరీర్ డౌన్ అవ్వడం తో పర్యావరణ వేత్తగా మారిన దియా ఇటువంటి కామెంట్స్ చెయ్యడం ఇదేమి తొలిసారి కాదు. గతంలో తన రెండో భర్త తో హనీమూన్ కు వెళ్లిన సమయంలో కూడా ఇలాగే ప్రకృతి కి, పురుషుడి ప్రైవేట్ పార్ట్శ్ కి లింక్ చేస్తూ ఓ ఆర్టికల్ షేర్ చేసి వార్తల్లో నిలిచారు.

తాజాగా పాడ్ క్యాస్ట్లోపాల్గొని వాతావరణ మార్పులకు, ప్రకృతి విధ్వంసానికి మగవాళ్లే కారణమని, తరతరాలుగా ఉన్న పితృస్వామ్య వ్యవస్థ వల్లే ఇప్పుడు ఇలా ప్రకృతికి సంక్షోభం ఏర్పడిందని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. మగవారు ప్రకృతి వనరులను కూడా ఓ మహిళాలా, అమ్మాయిలా భావించి ఏదో ప్రాపర్టీ తరహాలో వాడుకుని వదిలేస్తున్నారని చేసిన వ్యాఖ్యలపై కొందరు నెటిజన్లు సోషల్ మీడియా లో విపరీతంగ ట్రోల్ చేస్తున్నారు. వాస్తవానికి జర్మన్ కు చెందిన క్రిస్టయినకు, బెంగాలీ ప్రాంతానికి చెందిన హిందువుకు పుట్టిన ‘దియా’ హైదరాబాద్ లోనే పెరిగింది. ఇక్కడే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి 2000 సంవత్సరంలో మిస్ ఆసియా పసిఫిక్ టైటిల్ విజేతగా నిలిచింది. కానీ సినిమాల కంటే కూడా ఇలాంటి వివాదాస్పద కామెంట్స్ తోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంటుంది వైల్డ్ డాగ్ బ్యూటీ.

×
×
Ad