టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ అధినేత ఎం.శ్యామ్ప్రసాద్రెడ్డి సతీమణి వరలక్ష్మి బుధవారం హైదరాబాద్లో కన్ను మూశారు. ప్రస్తుతం ఆవిడ వయసు 62 సంవత్సరాలు. కొన్నేళ్ల క్రితం వరలక్ష్మి క్యాన్సర్ భారిన పడ్డారు. అందుకు సంబంధించి హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు వరలక్ష్మి. కాగా కాన్సర్ తో పోరాడుతూ ఆమె నిన్న అర్ధరాత్రి కన్నుమూసారు. వరలక్ష్మి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి కుమార్తెలలో ఒకరు, ప్రస్తుత డోన్ టీడీపీ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి స్వయానా చెల్లెలు. వరలక్ష్మి మృతితో శ్యాంప్రసాద్ రెడ్డి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగి పోయారు. తలంబ్రాలు, ఆహుతి ,అంకుశం,ఆగ్రహం ,అమ్మోరు ,అంజి, అరుంధతి వంటి సినిమాలను నిర్మించారు శ్యామ్ ప్రసాద్ రెడ్డి. మల్లెమాల ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ఈటీవీలో ప్రసారం అయ్యే జబర్దస్త్ ప్రోగ్రాం నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి. ఢీ డాన్స్ జోడి షో కి కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా జీన్స్, అదుర్స్ , క్యాష్ , స్టార్ మహిళ వంటి కార్యక్రమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి, వరలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వరలక్ష్మి అంత్యక్రియలు నేడు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. వరలక్ష్మి మృతి పట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
Tollywood : నిర్మాత శ్యామ్ప్రసాద్రెడ్డి సతీమణి కన్నుమూత..
- శ్యామ్ ప్రసాద్ రెడ్డికి సతీవియోగం
- క్యాన్సర్ తో పోరాడిన వరలక్ష్మి
- వరలక్ష్మి మృతి పట్ల టాలీవుడ్ సంతాపం