Site icon NTV Telugu

కరోనా టైంలో ‘ఏక్ మినీ కథ’ టీం సాహసం…!

Santhosh Shobhan's Ek Mini Katha On April 30th

ప్రముఖ దర్శకుడు శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ ‘పేపర్ బాయ్’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. ఇప్పుడు ఈ యంగ్ హీరో ‘ఏక్ మినీ కథ’ అనే కామెడీ ఎంటర్టైనర్ లో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంతో కార్తీక్ రాపోలు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి కథను అందిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు బాణీలు సమకూరుస్తున్నారు. యూవీ కకాన్సెప్ట్స్ బ్యానర్, మాంగో మాస్ మీడియా సంస్థ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ వణికిస్తోంది. ఈ నేపథ్యంలో చాలా సినిమాలు విడుదల వాయిదా పడింది. కానీ ‘ఏక్ మినీ కథ’ మేకర్స్ మాత్రం ధైర్యంగా కరోనాను ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు. ‘ఏక్ మినీ కథ’ను ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. ఇది వరకే ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, టీజర్లు సినిమాపై ఆసక్తిని పెంచేసాయి. కాగా ఈ చిత్రంలో శ్రద్ధా దాస్, బహ్మాజి, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, సుదర్శన్, జబర్దస్త్ అప్పారావు, జెమిని సురేష్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

Exit mobile version