హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేసి రెండు దశాబ్దాలు అవుతోన్నా రెజీనా కాసాండ్రా స్టార్ డమ్కు ఆమడ దూరంలో ఆగిపోతుంది. గ్లామర్ రోల్స్ చేసినా, ఫెర్ఫామెన్స్ కనబర్చినా రావాల్సిన ఐడెంటిటీ దక్కలేదు. ఇక ఆఫర్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. హీరోయిన్గా డిమాండ్ లేకపోవడం, ఛాన్సులు డల్ అవుతోన్న టైంలో “ఆ” మూవీ ఆమె కెరీర్ను మరోలా మార్చింది. ఇందులో గ్రేడ్ షేడ్లో ఆకట్టుకోవడంతో రెజీనాలో విలన్ను చూడటం మొదలు పెట్టారు మేకర్స్.
అడవి శేష్ హీరోగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ఎవరులో సమీరా మహాజన్గా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది రెజీనా. ఈ సినిమా తనకొక ఫేమ్ రావడంతో విలనీ రోల్స్ వస్తున్న ప్రతిసారి కాదనలేకపోతుంది. తమిళంలోనూ చక్ర, నెజమ్ మరప్పదిల్లై కూడా ఇలాంటి రోల్సే చేసింది రెజీనా. తాజాగా విడుదలైన జాట్లో భారతి రణతుంగా పవర్ ఫుల్ క్యారెక్టర్ చేసి బాలీవుడ్ అటెన్షన్ గ్రాబ్ చేసింది బ్యూటీ. ఈ ఏడాది మరీచికలోనే గ్రే షేడ్ క్యారెక్టర్ చేసిన రెజీనా.. ఈ రోల్స్ నుండి బయటపడలేకపోతుంది. మూకుత్తి అమ్మన్2లో కూడా యాంటోగనిస్టుగా కనిపించబోతుందని టాక్. సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న హై బడ్జెట్ ఫిల్మ్లో రెజీనా విలనీగా చూపించబోతున్నారట. నయనతార అండ్ రెజీనా మధ్య సీన్స్ ఇంటెన్సివ్గా ఉండబోతున్నాయని సమాచారం. రెజీనా హీరోయిన్గా మార్కెట్ కోల్పోవడంతో యాంటీ హీరోయిన్ రోల్స్కు షిఫ్టై తనను తాను కొత్తగా ప్రజెంట్ చేసుకుంటూ తన ఫెలో భామలకు ఓ రూట్ చూపిస్తోంది భామ.

