NTV Telugu Site icon

భారీ రీమేక్ లో సాయి పల్లవి స్థానంలో నిత్యా మీనన్… ఎందుకంటే ?

Reason why Nithya Menen replaced Sai Pallavi in Ayyappanum Koshiyam remake

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ హీరో రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియం’ తెలుగు రీమేక్. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది. మరోవైపు పవన్ కూడా కోవిడ్ నుంచి కోలుకున్నప్పటికీ ఆయన పూర్తి ఆరోగ్యంగా మారే వరకు సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వదు. అయితే ఈ చిత్రం పవన్ తో సాయి పల్లవి జోడి కట్టనుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ తెలియని కారణాలతో ఆఖరి నిమిషంలో సాయి పల్లవి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీంతో నిర్మాతలు సాయి పల్లవి స్థానంలో నిత్యా మీనన్‌ ను తీసుకున్నారు. అయితే తాజాగా సాయి పల్లవి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడానికి గల కారణం ఏంటో తెలిసింది. ఈ చిత్రంలో నటించడానికి సాయి పల్లవి 3 కోట్ల రూపాయలు పారితోషికంగా డిమాండ్ చేశారట. అయితే ఈ బ్యూటీ పాత్ర నిడివి తక్కువగా ఉంటుందట చిత్రంలో. ఆ చిన్న పాత్రకు సాయి పల్లవి అడిగిన రెమ్యూనరేషన్ ఎక్కువని భావించిన మేకర్స్ ఆమె స్థానంలో నిత్యా మీనన్ ను తీసుకున్నారట. అంతేకాదు నిత్యామీనన్ ఈ చిత్రాన్ని తక్కువ రెమ్యూనరేషన్ కే ఓకే చేసినట్టు తెలుస్తోంది. నిత్యా ఇప్పుడు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ రీమేక్‌లో పవన్ కళ్యాణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ఇక సాయి పల్లవి ఎక్కువ రెమ్యూనరేషన్ అడిగిందనే వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది.