మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, విలక్షణ నటుడు కమ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘ఎల్2 ఎంపురాన్’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్గా నిలిచింది. ఇది బ్లాక్బస్టర్ చిత్రం ‘లూసిఫర్’కు సీక్వెల్గా వచ్చింది. దీంతో ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపారు. మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి పాజిటివ్ టాక్తో దూసుకుపోయి రూ.250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో టోవినో థామస్, మంజు వారియర్, అభిమన్యు సింగ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా. ఈ చిత్రానికి దీపక్ దేవ్ సంగీతం అందించారు. కాగా ఆశీర్వాద్ సినిమాస్, లైకా ప్రొడక్షన్స్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేసిన, ఈ పూర్తి యాక్షన్ థ్రిల్లర్ మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది.
Also Read: Prabhas : ‘ది రాజా సాబ్’ పై దర్శకుడు మారుతి సాలిడ్ అప్డేట్..
ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్స్టార్ లో నేటి నుంచి ఈ చిత్రం తెలుగుతో పాటు మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను పంచుకుంది. ఇక థియేటర్ లో మిస్ అయిన వారు OTT లో చూసి ఎంజాయ్ చేయండి.
L2: Empuraan is now streaming only on JioHotstar@mohanlal @prithviofficial @GopyMurali @antonypbvr @gokulamstudios @aashirvadcine @LycaProductions @ManjuWarrier4 @ttovino @Indrajith_S @SaniyaIyappan_ @sujithvasudev @eriqebouaney @nylausha @JeromeFlynn @andreativadar… pic.twitter.com/GQoBbzDC2v
— JioHotstar Malayalam (@JioHotstarMal) April 23, 2025
