మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ తాజాగా “గ్రీన్ ఇండియా” ఛాలెంజ్ లో పాల్గొన్నారు. ఈ రోజు హైదరాబాద్ కు చేరుకున్న అమీర్ ఖాన్ యంగ్ హీరో నాగ చైతన్య, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తో కలిసి బేగంపేట ఎయిర్ పోర్ట్ లో మొక్కలు నాటారు. టాలీవుడ్ స్టార్స్ అంతా భాగం అవుతున్న ఈ కార్యక్రమంలో బాలీవుడ్ హీరో కూడా చేరడం విశేషం. “గ్రీన్ ఇండియా” ఛాలెంజ్ అద్భుతమని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, అప్పుడే భవిష్యత్ తరాలకు ప్రకృతి లాభాలు చేకూరుతాయని అమీర్ అన్నారు.
Read Also : “పొన్నియన్ సెల్వన్” షూటింగ్ పూర్తి
ప్రస్తుతం అమీర్ ఖాన్ “లాల్ సింగ్ చద్ధా” సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ హిందీతో పాటు తెలుగులోనూ ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రంలో నాగ చైతన్య కీలకపాత్రలో నటించారు. ఇదే నాగ చైతన్యకు హిందీలో మొదటి చిత్రం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో మేకర్స్ బిజీగా ఉన్నారు. ఇక అమీర్ ఖాన్ ఇప్పుడు హైదరాబాద్ రావడానికి కారణం “లవ్ స్టోరీ” ప్రీ రిలీజ్ ఈవెంట్. నాగ చైతన్య హీరోగా నటిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో అమీర్ ఖాన్ అతిథిగా కనిపించబోతున్నారు.