Site icon NTV Telugu

ఒమిక్రాన్‌ దెబ్బ.. విమాన ఛార్జీలకు రెక్కలు..!

flights

ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కోవడానికి అన్ని దేశాలు సిద్ధం అవుతున్నాయి.. ఊహించని విధంగా స్పీడ్‌గా విస్తరిస్తూ వస్తున్న ఈ వేరియంట్‌ ఇప్పటికే 38 దేశాలను తాకినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ప్రకటించింది.. అయితే, ఇదే సమయంలో విమాన ఛార్జీలకు రెక్కలు వచ్చాయి.. ఇప్పటికే ఒమిక్రాన్‌ బాధిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్‌ పరీక్షలు తప్పనిసరి చేశాయి ఆయా దేశాలు.. ఒమిక్రాన్‌ మరింత విజృంభిస్తే.. మరిన్ని ఆంక్షలు తప్పవని.. అంతర్జాతీయ ప్రయాణాలు పూర్తిస్థాయిలో రద్దుచేసే అవకాశం లేకపోలేదని ప్రచారం కూడా సాగుతోంది.. దీంతో చాలా మంది ట్రావెల్ టికెట్లు బుక్ చేసుకోవడానికి మొగ్గు చూపడంతో.. విమాన ఛార్జీలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయని.. దీనికి పండుగల సీజన్‌ కూడా తోడు కావడం కూడా విమాన ఛార్జీల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు..

Read Also: ఒమిక్రాన్‌ విజృంభణ.. 38 దేశాలకు పాకింది..

కోవిడ్‌ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ భయంతో భారత్ నుంచి అధిక రద్దీ ఉండే యూఏఈ, అమెరికా, బ్రిటన్, కెనడా లాంటి దేశాలకు విమాన చార్జీలు అమాంతం పెరిగిపోయినట్టు చెబుతున్నారు.. తాజా సమాచారం ప్రకారం ఢిల్లీ నుంచి కెనడాలోని టోరంటోకి గతంలో కనీస ఛార్జీ రూ.80వేలుగా ఉంటే.. ఇప్పుడు ఏకంగా అది రూ. 2.37 లక్షలకు చేరిపోయింది.. ఇక, ఢిల్లీ నుంచి లండన్‌కు గతంలో రూ. 60గా ఉంటే.. ఇప్పుడు రూ. 1.20 లక్షలు దాటేసింది.. ఢిల్లీ నుంచి దుబాయ్‌కి రూ. 20 వేలుగా ఉన్న టికెట్‌ ధర ఇప్పుడు రూ. 33 వేల వరకు పెరిగింది.. ఇతర దేశాలకు కూడా ఇదే పరిస్థితి ఉందని సమాచారం.. ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లాలంటే రెట్టింపు డబ్బును ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా సరే.. కరోనా మరింత విస్తరించకముందే గమ్యానికి చేరుకోవాలని ప్రయాణికులు ఖర్చు చేయడానికి కూడా వెనుకాడడంలేదని తెలుస్తోంది.

https://www.youtube.com/watch?v=8QmpiSGFOpU
Exit mobile version