వాషింగ్టన్ టెక్సాస్లోని హిల్ కంట్రీ ప్రాంతంలో ఒక చిన్న విమానం చెట్లను ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందారు. మరణించిన వారంతా ఒక పికిల్బాల్ టోర్నమెంట్కు వెళ్తున్న క్రీడాకారులని అధికారులు శుక్రవారం తెలిపారు. టెక్సాస్ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ ప్రకారం, ఆస్టిన్కు నైరుతి దిశలో సుమారు 40 మైళ్ల (65 కిలోమీటర్ల) దూరంలో ఉన్న వింబర్లీ నగరంలో గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది.
పైలట్తో కలిపి విమానంలోని నలుగురు ప్రయాణికులు సంఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు టెక్సాస్ అధికారులు వెల్లడించారు. మృతుల పేర్లను అధికారులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే, వారంతా టెక్సాస్లోని అమరిల్లోలోని అమరిల్లో పికిల్బాల్ క్లబ్ సభ్యులని, ఒక టోర్నమెంట్కు ప్రయాణిస్తున్నట్లు క్లబ్ వర్గాలు తెలిపాయి.
