Site icon NTV Telugu

Student Dies: స్కూల్ కు చెప్పులతో వచ్చిన విద్యార్థిని.. చెంప దెబ్బ కొట్టిన ప్రిన్సిపాల్.. తర్వాత ఏమైందంటే..

Untitled Design (9)

Untitled Design (9)

చెప్పులు వేసుకుని స్కూల్‌కు వచ్చిన విద్యార్థిని చెంపపై ప్రిన్సిపాల్ కొట్టింది. నాటి నుంచి మానసికంగా కుంగిపోయిన ఆ బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. దీంతో విద్యార్థిని కుటుంబం, గ్రామస్తులు రోడ్డును దిగ్బంధించి ఆమె మృతదేహంతో నిరసన తెలిపారు.

Read Also: Mahabharath: క్యాన్సర్ తో మహాభారత్ నటుడి మృతి.. కర్ణుడి పాత్రలో…

జార్ఖండ్‌లోని గర్హ్వా జిల్లా బార్‌గఢ్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో దివ్య కుమారి అనే బాలిక 12వ తరగతి చదువుతుంది. సెప్టెంబర్ 15న ఆ విద్యార్థిని బూట్లకు బదులుగా చెప్పులు ధరించి స్కూలుకు వచ్చింది. అసెంబ్లీకి అలాగే హాజరైంది. స్కూల్‌ ప్రిన్సిపాల్ (ఇన్‌చార్జ్) ద్రౌపది మింజ్ డ్రెస్‌ కోడ్‌ పాటించనందుకు ఆమెను అందరి ముందు తిట్టింది. అంతేకాకుండా బాలికను చెంపదెబ్బ కొట్టింది. ఈ సంఘటన తర్వాత విద్యార్థిని దివ్య తొలుత బాగానే కనిపించినా.. ఆ తర్వాత ఆమె డిప్రెషన్‌కు గురైంది. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు డాల్టన్‌గంజ్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆక్కడ దివ్యకు ప్రాథమిక చికిత్స అందించిన ఆ తర్వాత రాంచీలోని రిమ్స్‌కు రిఫర్‌ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ దివ్య అక్టోబర్‌ 14న మరణించింది. విద్యార్థిని దివ్య మరణానికి స్కూల్‌ ప్రిన్సిపాల్ మానసిక వేధింపులు కారణమని ఆమె తల్లిదండ్రులు బార్‌గఢ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Read AlsoDharmapuri Arvind : జూబ్లీహిల్స్ ఓట్ల చోరీపై కేటీఆర్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి

డ్రెస్‌ కోడ్‌ పాటించని విద్యార్థిని దివ్య కుమారిని, ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్ ద్రౌపది మింజ్ అందరి ముందు తిట్టింది. అంతేగాక ఆమె చెంపపై కొట్టింది. ఈ సంఘటన తర్వాత విద్యార్థిని దివ్య తొలుత బాగానే కనిపించింది. ఆ తర్వాత ఆమె నిరాశకు గురైంది. దీంతో కుటుంబ సభ్యులు డాల్టన్‌గంజ్‌లోని ఆసుపత్రిలో దివ్యకు ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత రాంచీలోని రిమ్స్‌కు ఆమెను రిఫర్‌ చేశారు. అక్కడ చికిత్స పొందుతున్న దివ్య అక్టోబర్‌ 14న మరణించింది.

Read Also: : Jubilee Hills By Poll : భారీ స్థాయిలో నామినేషన్లు.. ఇప్పటి వరకు ఎన్నంటే..?

దీంతో అవమానంగా భావించిన విద్యార్ధిని డిప్రెషన్‌లోకి వెళ్లి.. సూసైడ్‌ చేసుకుని మృతి చెందింది. బాలిక మరణించడంతో ఆగ్రహించిన ఆమె కుటుంబ సభ్యులు పాఠశాలపై దాడి చేశారు. తమకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు, జిల్లా అధికారులు అక్కడకు చేరుకుని ఆందోళన కారులను సముదాయించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్థిని మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారు. ఈ విషయంపై మాట్లాడటానికి ప్రిన్సిపాల్ నిరాకరించారు..

Exit mobile version