Palestinian Flags: కాకినాడలో మిలాద్ ఉన్-నబీ ర్యాలీ సందర్భంగా పాలస్తీనా జాతీయ జెండాలతో కార్లలో వెళ్లిన యువకులను ముస్లీం మత పెద్దలు వివరణ అడిగారు. తప్పు జరిగింది ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కానివ్వమని సదరు యువకులు క్షమాపణ చెప్పారు. ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు మిలాద్ ఉన్-నబీ ర్యాలీలో పాల్గొంటూ కార్లపై పాలస్తీనా జెండాలను కొందరు ముస్లిం యువకులు ఎగుర వేసినట్లు గుర్తించారు.
ఈ ఘటనపై కొందరు యువకులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. పాలస్తీనా జాతీయ జెండాలను ఎందుకు ప్రదర్శించారు? ఎవరు తయారు చేశారు? బయట నుంచి ఎవరైనా వచ్చారా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. కానీ, యువకులు మాత్రం తమకు వేరే ఉద్దేశం లేదని, పాలస్తీనా యుద్ధంలో అమాయకులు చనిపోతున్నందుకు వారికి సపోర్టుగా మాత్రమే ఈ జెండాలను ప్రదర్శించామని వెల్లడించారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
