హిమాచల్‌ప్రదేశ్‌లోని మణికర్ణ లోయలో పిని అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఓ వింత ఆచారం అమలులో ఉంది.

ఆ గ్రామానికి చెందిన మహిళలు దుస్తులు ధరించకుండా నగ్నంగా వీధుల్లో తిరగడం ఆనవాయితీగా వస్తున్నది. 

అయితే ఏడాది పొడవునా ఈ ఆచారం ఉండదు. ఏడాదికి ఒక ఐదు రోజులు ఆ గ్రామానికి చెందిన మహిళలు ఈ ఆచారాన్ని పాటిస్తారు.

శతాబ్దాల కాలం నాటి ఈ ఆచారాన్ని అక్కడి మహిళలు ఇప్పటికీ పాటిస్తూ వస్తున్నారు. అయితే ఈ ఆచారం కేవలం స్త్రీలకు మాత్రమే సంబంధించినది కాదు. 

ఈ సందర్భంగా పురుషులు కూడా కొన్ని నియమాలు పాటించాలి. మహిళలు ఈ వ్రతంలో ఉన్నప్పుడు వాళ్లతో వారి భర్తలు మాట్లాడకూడదు. మద్యం, మాంసం తినకూడదు. అలా చేస్తే వ్రత భంగం కలిగి కీడు జరుగుతుందని ఆ గ్రామస్తుల నమ్మకం.

కాగా ఏడాదిలో ఓ ఐదు రోజులు మహిళలు దుస్తులు విప్పుకుని ఉండకపోతే ఆపద వస్తుందని వారి భయం. ఆపదకు రాక్షసులే కారణమని వారు నమ్ముతున్నారు. 

శతాబ్దాల క్రితం వారి గ్రామాన్ని రాక్షసులు ఆక్రమించారట. ఆ సమయంలో అసురులు అందమైన దుస్తులు ధరించిన వివాహిత స్త్రీలను తీసుకువెళ్లారట.

మొత్తం ఐదు రోజులపాటు రాక్షసులు ఈ దారుణానికి పాల్పడ్డారట. దాంతో దేవుడు లాహువా ఘోంట్ ఆ గ్రామానికి వచ్చి ఆ రాక్షసులను నాశనం చేశాడట. 

అందుకే ఏడాదిలో ఆ ఐదు రోజులు మహిళలు దుస్తులు ధరిస్తే కీడు జరుగుతుందని అక్కడి ప్రజలు నమ్ముతారు. అందుకే ఏటా ఆ ఐదు రోజులపాటు తమ దుస్తులను వదిలేస్తారు.