ఎన్‌ఐఏఏఏ నివేదిక ప్రకారం.. మహిళల్లో మద్యం వినియోగం పెరుగుతోంది. 

 మద్యం సేవించేవారిలో పురుషుల కంటే మహిళలకు ఆల్కహాల్ సంబంధిత సమస్యల ప్రమాదం ఎక్కువగా ఉంది. 

  మన దేశంలో మద్యం తాగే మహిళలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల గురించి తెలుసుకుందా.. 

 ఛత్తీస్‌గఢ్‌లో దాదాపు 5% మంది మహిళలు మద్యం సేవిస్తున్నారు. ఈ రాష్ట్రం ఏడో స్థానంలో నిలిచింది. 

కేంద్ర పాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవులలో 5% మంది మహిళలు మద్య పానీయాలు తీసుకుంటున్నారు.   

 జార్ఖండ్‌లో, 6.1% మంది మహిళలు మద్యం సేవిస్తున్నారు. ఇది ఐదో స్థానంలో కొనసాగుతోంది. 

 తెలంగాణలో, 6.7% మంది మహిళలు మద్యం సేవిస్తున్నారు. మన రాష్ట్రం నాలుగో స్థానానికి పరిమితమైంది.   

 అస్సాంలో 7.3%తో మూడోస్థానంలో ఉంది.  

 సిక్కింలో, 16.2% మంది మహిళలు ఆల్కహాల్ తీసుకుంటారు. జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది.

 నంబర్ వన్ ప్లేస్‌లో అరుణాచల్ ప్రదేశ్‌ ఉంది.  ఇక్కడ15-49 సంవత్సరాల వయస్సు గల స్త్రీలలో 26% మంది మద్యం సేవిస్తున్నారు.